Comedian Died : క్యాన్సర్ తో కన్నుమూసిన ఫేమస్ కమెడియన్..

Comedian Vishwashwara Rao
Comedian Died : తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు పోషించిన నటుడు విశ్వేశ్వరరావు క్యాన్సర్ తో బాధపడుతూ ఏప్రిల్ 2వ తేదీ చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా విశ్వేశ్వరరావు క్యాన్సర్ తో పోరాడుతున్నారని, వ్యాధి కోసం చికిత్స పొందుతున్నారని సమాచారం.
విశ్వేశ్వరరావు ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. సూర్య నటించిన పితామగన్ చిత్రంలో లైలా అమాయక తండ్రి పాత్రలో నటించి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలోని జైలు సన్నివేశంలో లైలా పాపులర్ డైలాగ్ ‘లూసా పా నీ’ చాలా ప్రసిద్ధి చెందింది. మాధవన్ నటించిన ఎవనో ఒరువన్ సినిమాలో చిరాకు కలిగించే షాప్ ఓనర్ గా చిన్న పాత్ర పోషించాడు.
పలు తెలుగు చిత్రాల్లో కమెడియన్ గా కూడా నటించిన ఆయన తన సుదీర్ఘ కెరీర్ లో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. టీవీ సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించాడు. పొట్టి ప్లీడర్, భక్త పోతన, అందాల రాముడు, సిసింద్రీ చిట్టిబాబు వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
ఇటీవలే తమిళ చిత్ర పరిశ్రమ లొల్లు సభ ఫేమ్ హాస్య నటుడు శేషును కోల్పోయింది. ఆయన గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించిన వారం రోజుల్లోనే డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఆయన అకాల మరణం తమిళ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘వేటైయాడు విలైయాడు’, ‘వడచెన్నై’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఇప్పుడు విశ్వేశ్వరరావు మృతితో కోడంబాక్కంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.