JAISW News Telugu

Kavitha : బ్రేకింగ్ : కవితకు షోకాజ్ నోటీసులు

Kavitha : బీఆర్ఎస్‌లో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలతో పార్టీలో తీవ్ర చర్చలు జరగుతున్నాయి. ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు మద్దతుగా ముందుకురాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేయడం, సోషల్ మీడియాలో తనపై దూషణలపై స్పందించడం పార్టీపై నేరుగా ఆరోపణలుగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్ వాదనకు బలాన్నిచ్చాయని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం, ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతోందని సమాచారం. కేటీఆర్ విదేశాల్లో ఉన్న ఈ సమయంలో నోటీసులు ఇవ్వడం ద్వారా వివాదాన్ని తగ్గించే ప్రయత్నంగా ఈ చర్యని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Exit mobile version