Kanipakam Vinayaka laddu : కాణిపాకం వినాయకుడి లడ్డూ వేలం.. రూ.4.25 లక్షలు

Kanipakam Vinayaka laddu
Kanipakam Vinayaka laddu : చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆఖరి రోజు తెప్పోత్సవం సందర్భంగా గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించారు. 21 కిలోల బరువు ఉన్న లడ్డూ మహాప్రసాదాన్ని బహిరంగ వేలం వేయగా చుట్టు పక్కల గ్రామస్థులతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. ఈ లడ్డూను రూ.4 లక్షల 25 వేలకు స్థానిక విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి దక్కించుకున్నారు.
ఈ వేలం పాట స్థానిక (పూతలపట్టు) ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేలంలో 21 కేజీల బరువు ఉన్న భారీ లడ్డూను రూ.4 లక్షల 25 వేలకు దక్కించుకున్న విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి దంపతులకు ఎమ్మెల్యే, ఈవో, వేదపండితులు అందజేశారు. కాణిపాకం వినాయకుడి లడ్డూ ప్రసాదం దక్కించుకోవడం
ఆనందంగా ఉందని తేజోమూర్తి దంపతులు తెలిపారు.