
Lokesh
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆరు కీలక శాసనాలను ప్రతిపాదించింది అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. కడప మహానాడులో ఆయన మాట్లాడుతూ, పేదలకు అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశమేనని, ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షం, అధికారంలో అనుభవమున్న పార్టీగా, తెలుగువారి గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
తెదేపా ప్రతిపాదించిన ఆరు శాసనాలు ఇవే:
తెలుగుజాతి విశ్వఖ్యాతి
యువగళం
స్త్రీశక్తి
పేదల కోసం సోషల్ రీఇంజినీరింగ్
అన్నదాతకు అండ
కార్యకర్తలే అధినేత
ఇవన్నీ పార్టీ భవిష్యత్తు దిశగా మద్దతు ఇచ్చే శక్తివంతమైన మార్గదర్శకాలు అవుతాయని లోకేశ్ అన్నారు.