Indus Waters Treaty : మాకు రెడ్‌లైన్.. సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్ సంచలనం

Indus Waters Treaty : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ దీనిపై తీవ్రంగా స్పందించారు. నీటి విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందం తమకు “రెడ్‌లైన్” అని ఆయన పేర్కొన్నారు. వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ప్రిన్సిపాల్స్, ఇతర బోధనా సిబ్బందితో మాట్లాడుతూ జనరల్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని, ఇది తమకు జీవన్మరణ సమస్య అని ఆయన నొక్కి చెప్పారు. ఈ అంశంపై పాకిస్థాన్ తన వైఖరిని స్పష్టం చేయడానికి ఈ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు.

TAGS