JAISW News Telugu

Prime Minister : ఏపీ చరిత్రలోనే ఈరోజు శాశ్వతం.. ప్రధానికి ఆ విషయంలో బాబు ఫుల్ సపోర్ట్

Prime Minister Modi : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంతో ఇది రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచే రోజు అని ప్రకటించారు. గత ఐదేళ్లలో అమరావతిపై జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ, కేంద్రం సహకారంతో పునర్నిర్మాణం ప్రారంభమవుతుండటం గొప్ప అంశమని అన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, దేశ ఆర్థిక అభివృద్ధిలో భారత్ స్థానాన్ని గుర్తుచేశారు. అన్ని జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. మొత్తంగా చంద్రబాబు తన లక్ష్యం సాధించారని విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version